తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫ్యూచర్ సిటీలో తొలి పారిశ్రామిక వాడ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. జపాన్ కంపెనీ మారుబేనీ సుమారు వెయ్యి ఎకరాల్లో రూ.1000 కోట్ల పెట్టుబడితో పారిశ్రామిక వాడను ఏర్పాటు చేయనుంది. దీని ద్వారా 30 వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి, మరియు రూ.5 వేల కోట్ల వ్యాపారం జరుగుతుందని అంచనా. దీనికి భూమి కేటాయించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. భూకేటాయింపులు అయిపోగానే.. మారుబేనీ సంస్థ పారిశ్రామిక వాడ శంఖుస్థాపన జరగనుందని అధికారులు తెలిపారు.