ఉమ్మడి అనంతపురం జిల్లాలో మహిళా దొంగలు రెచ్చిపోతున్నారు. రద్దీగా ఉన్న బస్టాండ్లు, బ్యాంకుల వద్ద చోరీలకు పాల్పడుతున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఈ తరహా చోరీలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అనంతపురం పోలీసులు వీటిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. తమిళనాడు సరిహద్దుల నుంచి వచ్చిన మహిళలు ఈ చోరీలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు.