బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తెలంగాణలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ వర్ష హెచ్చరికలు జారీ చేసింది. నిర్మల్, నిజామాబాద్, మెదక్, కామారెడ్డి, సంగారెడ్డి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. ఇక ఇప్పటికే రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా కరీంనగర్ జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదైంది. పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. లోయర్ మానేరు, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు.