AP Weather Today: రాబోయే రెండు రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, అనంతపురం, కడప జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. నంద్యాల జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదైంది. రుతుపవనాలు త్వరలో నిష్క్రమించనున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. అనంతపురం, కర్నూలు జిల్లాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లడంతో పంటలకు నష్టం వాటిల్లింది.