AP Weather Today: ఆంధ్రప్రదేశ్లో వర్షాలు, వరదలు ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఉత్తరాంధ్రలో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. కృష్ణా, గోదావరి నదులు ఉధృతంగా ప్రవహిస్తూ ప్రమాదకర స్థాయికి చేరుకుంటున్నాయి. ప్రకాశం బ్యారేజ్, ధవళేశ్వరం వద్ద ప్రమాద హెచ్చరికలు కొనసాగుతున్నాయి. గోదావరికి భారీగా వరద పెరిగే సూచనలున్నాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వాగులు, కాలువలు దాటవద్దని విపత్తుల సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ హెచ్చరించారు.