AP Weather Today: ఆంధ్రప్రదేశ్లో రానున్న రెండు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండటంతో రాష్ట్రంలో మేఘావృతమైన వాతావరణం ఏర్పడుతుంది. గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. అలాగే రైతులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. నైరుతి రుతుపవనాలు త్వరలో కేరళను తాకనున్నాయి. మరిన్ని వివరాలు ఇలా ఉన్నాయి.