దక్షిణ అండమాన్ సముద్రంలో ఏర్పడుతున్న అల్పపీడనం వాయుగుండంగా, ఆపై తుఫానుగా మారే సూచనలున్నాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా రాష్ట్రాల్లో వాతావరణం మారనుంది. నవంబర్ 26- 28 మధ్య ఉత్తర ఆంధ్ర, తూర్పు తెలంగాణలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.