బండి భగీరథ్ పోక్సో కేసుకు సంబంధించి.. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చట్టం ముందు అందరూ సమానమేనని తేల్చి చెప్పారు. బండి భగీరథ్ అరెస్ట్ కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందంటూ వస్తున్న వార్తలను ఖండించిన ఆయన.. అతడి అరెస్ట్ను ఆపడం ఎవరి వల్ల కాదని స్పష్టం చేశారు. బండి భగీరథ్ విదేశాలకు వెళ్లినా.. తిరిగి రప్పించడం పెద్ద కష్టమేమీ కాదని టీపీసీసీ చీఫ్ వెల్లడించారు.