తెలంగాణ హైకోర్టులో కీలక పరిణామం చోటు చేసుకుంది. పోక్సో కేసులో బండి భగీరథ్ దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ సమయంలో లాయర్లు సంయమనం కోల్పోయారు. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడంతో.. వెంటనే న్యాయమూర్తి స్పందించి.. తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. లాయర్లకు సంయమనం లేకపోతే.. కేసును మరో బెంచ్కు మార్చుకోవాలని హితవు పలికారు. దీంతో కొద్దిసేపు కోర్టులో హైడ్రామా నడిచింది.