బండి భగీరథ్పై నమోదైన పోక్సో కేసులో సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. తనపై నమోదైన పోక్సో కేసును కొట్టేయాలని.. ఈ కేసులో అరెస్ట్ కాకుండా ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని బండి భగీరథ్ పెట్టుకున్న పిటిషన్ను కోర్టు వారం రోజులు వాయిదా వేసింది. అయితే మధ్యంతర బెయిల్ పిటిషన్పై మాత్రం రేపు విచారణ జరుపుతామని తెలిపింది. ఈ విచారణలో ప్రధానంగా బాధితురాలి వయసుపైనా ఎక్కువ వాదనలు జరగడం గమనార్హం. ఆమె మైనరా కాదా అనేది ఇప్పుడు తీవ్ర చర్చకు దారి తీసింది.