బడంగ్‌పేట మున్సిపాలిటీలో రూ.122 కోట్ల స్కాం.. డిప్యూటీ కమిషనర్ సహా పది మంది సస్పెండ్

2 months ago 17
హైదరాబాద్ శివారు బడంగ్‌పేట మున్సిపాలిటీలో జరిగిన రూ.122 కోట్ల నిధుల దుర్వినియోగం కేసులో జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ 10 మంది అధికారులను సస్పెండ్ చేశారు. పారిశుద్ధ్యం, ఇంజినీరింగ్ పనుల్లో అక్రమాలు జరిగాయని విజిలెన్స్ విచారణలో తేలింది. కౌన్సిల్ అనుమతి లేకుండానే నిధులు పక్కదారి పట్టించడమే కాకుండా.. విలీనానికి ముందు రికార్డులను కూడా మాయం చేసినట్లు గుర్తించారు. ఈ భారీ స్కాం వ్యవహారం మున్సిపల్ శాఖలో పెను సంచలనంగా మారింది.
Read Entire Article