ఫిబ్రవరి 2న హైదరాబాద్ శివారు నార్సింగిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్లిన వైద్యురాలు భూమిక.. వారం రోజుల పాటు మృత్యువుతో పోరాడి చివరికి బ్రెయిన్ డెడ్ అయ్యింది. దీంతో.. భూమిక అవయవాలను దానం చేసేందుకు ఆమె తల్లిదండ్రులు ముందుకొచ్చారు. దీంతో.. ఆ వైద్యురాలు బతికున్నప్పుడే కాదు.. చనిపోతూ కూడా నాలుగు ప్రాణాలు కాపాడి ఆ కుటుంబాల్లో వెలుగులు నింపింది.