మనిషి చనిపోయాక కూడా కష్టాలు తప్పడం లేదు. హైదరాబాద్ శివారు ప్రాంతమైన బుద్వేల్లో కొందరు శ్మశాన వాటికల్లో దందా చేస్తున్నారు. చనిపోయిన వారి అంత్యక్రియలకు వేలకు వేలు డిమాండ్ చేస్తున్నారు. డబ్బులు ఇవ్వకపోతే అంత్యక్రియలు జరగనివ్వకుండా అడ్డుకుంటున్నారు. దీంతో దిక్కుతోచని స్థితిలో కుటుంబ సభ్యులు మరింత వేదనకు గురవుతున్నారు. ఈ దారుణాలపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.