బతుకు పోరాటంలో పోరాడే స్థోమతలేక, పోరాడగలరన్న నమ్మకమిచ్చే తోడు లేక.. అసలి సొలసి కుమిలిపోయిన ఇద్దరు అక్కాచెల్లెళ్లు.. చివరికి తమ ప్రాణాలు తామే తీసుకున్న విషాదకర ఘటన సికింద్రాబాద్లో చోటుచేసుకుంది. మిగతావారితో కలవలేకపోవడం, ఎవరితోనూ మనసు విప్పి మాట్లాడలేకపోవడంతో తీవ్ర మనోవేదనకు గురయ్యారు. ఈ క్రమంలోనే తమలో భావాలను ఎవరికీ చెప్పుకోలేక, తమలో తాము దాచుకోలేక చివరికి పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు.