బనకచర్ల ప్రాజెక్టు రాయలసీమకు గేమ్ ఛేంజర్గా మారుతుందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. గోదావరి నుంచి వృథాగా పోయే 200 టీఎంసీల నీటిని ఉపయోగించుకుంటే రాయలసీమకు మేలు జరుగుతుందన్నారు. ఈ ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకిస్తోంది. ఇది తమ నీటి హక్కులకు భంగం కలిగిస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తోంది. అయితే, వృథాగా పోయే నీటిని మాత్రమే వాడుకుంటామని ఏపీ ప్రభుత్వం చెబుతోంది.