బర్డ్ ఫ్లూతో చనిపోతున్న కోళ్లు.. చికెన్ తినొద్దని ప్రజలకు అధికారులు హెచ్చరిక

6 hours ago 1
ఏపీలోని ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో బర్డ్ ఫ్లూ కలకలం రేపుతోంది. వేలాదిగా కోళ్లు ఈ వ్యాధి బారినపడి చనిపోతున్నాయి. తూర్పు గోదావరి జిల్లాలో పెద్ద సంఖ్యలో కోళ్ల మరణాలపై అధికారులు అప్రమత్తం అయ్యారు. బర్డ్ ఫ్లూ కారణంగానే ఇవి మృత్యువాత పడుతున్నట్టు నిర్దారించారు. దీంతో కొన్ని రోజుల పాటు ప్రజలు చికెన్‌కు దూరంగా ఉండాలని అధికారులు ఆదేశించారు. చికెన్ వినియోగం తగ్గించాలని అన్నారు. జిల్లాలోని పలు గ్రామాల్లోని కోళ్లఫారంల నుంచి శాంపిల్స్ సేకరించారు. కానూరు గ్రామంలోని కోళ్ల ఫారం నుంచి సేకరించిన శాంపిల్స్ బర్డ్ ఫ్లూ పాజిటివ్ గా నిర్ధారణ అయ్యాయి. దీంతో జిల్లా అధికార యంత్రాంగం కంట్రోల్ రూం ఏర్పాటు చేసింది. అలాగే, చికెన్ షాపుల యజమానులకు కలెక్టర్ ఆదేశాలు జారీచేశారు. ఉత్తర్వులను ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
Read Entire Article