brothers reunite: రాజన్న సిరిసిల్ల జిల్లాలో 60 ఏళ్ల వయసులో ఇద్దరు అన్నదమ్ములు పంతాలు వీడి తిరిగి కలిశారు. కొలనూరు గ్రామానికి చెందిన నాగయ్య, రాములు అనే అన్నదమ్ములు పదేళ్ల క్రితం చిన్న గొడవతో విడిపోయారు. వారి మేనల్లుడు మరణించడంతో అతడి కార్యక్రమానికి హాజరైన అన్నదమ్ములు.. కుమారుడి ప్రయత్నంతో పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుని కన్నీటితో కౌగిలించుకున్నారు. ఈ సంఘటన స్థానికులను కదిలించింది. పదేళ్ల తర్వాత సోదరులిద్దరూ కలవడం పట్ల కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆ వివరాలు..