తెలంగాణ ప్రభుత్వం బస్ పాస్ ధరలు పెంచడంతో ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఎమ్మెల్సీ కవిత ఆందోళన చేయగా, మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. టోల్ ఛార్జీల నుంచి మినహాయింపు ఇస్తే ధరలు తగ్గిస్తామని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. విద్యార్థుల బస్ పాస్ ఛార్జీలు మూడేళ్ల నుంచి పెంచలేదన్నారు. ఇకపై విద్యార్థులు స్టూడెంట్ పాస్తో ఆర్డినరీతో పాటు మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లోకి అనుమతిస్తామని తెలిాపరు. సామాన్యుల బస్ పాస్ ధర 20 శాతం పెరిగింది.