తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు పథకం అమలు తర్వాత ఆర్టీసీ బస్సుల్లో గొడవలు ఎక్కువయ్యాయి. టిక్కెట్టు డబ్బులు ఇవ్వలేదని, తను ఆపుకున్న సీట్లో ఇంకెవరో కూర్చొన్నారని, బస్సు ఆపలేదని, చేయి తాకిందని, కాలు తాకిందని, తోసుకుంటూ వెళ్లారని తరచుగా ఇలాంటి గొడవలు కనిపిస్తుంటాయి. అయితే ఇలాంటి ఘటనే హైదరాబాద్ ఉప్పల్లో జరిగింది. తాను కింద పడినా, తన పిల్లలు ఎక్కే వరకు బస్సు ఆపలేదని 10 కిలో మీటర్లు వెంబడించింది ఓ మహిళ. కండక్టర్, డ్రైవర్ను నిలదీసింది.