Visakhapatnam women Theft in Buses: విశాఖపట్నంలో ఇద్దరు మహిళలు ఆర్టీసీ బస్సులు, ఆటోల్లో ప్రయాణించే వారిని లక్ష్యంగా చేసుకుని బంగారు నగలు దొంగతనం చేస్తున్నారు. పెందుర్తి పోలీసులు వారిని అరెస్ట్ చేసి 50 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. సింహపురి కాలనీకి చెందిన మంగతాయారు, విజయనగరం జిల్లాకు చెందిన మోహిని అనే ఇద్దరు మహిళలు తమ నగలు పోగొట్టుకున్నట్లు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు నిందితులను రిమాండ్కు తరలించారు.