దేశంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో బాణాసంచా కాల్చడంపై పోలీసులు నిషేధం విధించారు. బాణాసంచా శబ్దాలు పేలుళ్లుగా అన్వయించుకునే ప్రమాదం ఉండటంతో ప్రజల్లో భయాందోళనలు నెలకొనే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. హైదరాబాద్ నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. వేడుకల్లో బాణాసంచా కాల్చకుండా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ఇది దేశ భద్రతకు సంబంధించిన అంశం కాబట్టి ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పూర్తి వివరాలిలా ఉన్నాయి.