హైదరాబాద్ మెట్రో నష్టాల్లో నడుస్తుండటంతో, దానిని వదిలించుకోవడానికి ఎల్అండ్టీ సిద్ధంగా ఉంది. నిర్వహణ భారం అధికం కావడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగించేందుకు లేఖ రాసింది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా మెట్రోను నడపలేమని, బకాయిలు పెండింగ్లో ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎల్అండ్టీ తెలిపింది.