మహబూబ్నగర్ జిల్లా గండీడ్ మండలంలోని దాబాలో బీరు సీసాలో వ్యర్థాలు కనిపించడంతో వివాదం నెలకొంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. గతంలోనూ ఇలాంటి సంఘటనలు జరిగాయని వినియోగదారులు చెబుతున్నారు. వైన్ షాపు యజమానులు మాత్రం తమకు సంబంధం లేదని అంటున్నారు. స్థానిక ఎక్సైజ్ సీఐ బాలకృష్ణ సంబంధిత వైన్ షాపులో విచారణ జరుపుతామని తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.