తెలంగాణవ్యాప్తంగా చలి తీవ్రత గణనీయంగా పెరిగింది. ముఖ్యంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో రికార్డు స్థాయి కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాబోయే రోజుల్లో చలి మరింత పెరిగే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. చలి నుంచి రక్షించుకోవడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవడం అత్యవసరం.