కూకట్పల్లిలో సంచలనం సృష్టించిన పదేళ్ల బాలిక సహస్ర హత్య కేసులో రోజులు గడుస్తున్న కొద్ది విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. బ్యాట్ దొంగతనానికి వెళ్లిన బాలుడు.. తనను చూసిందనే కారణంతో అత్యంత దారుణంగా చిన్నారి సహస్రను హత్య చేయడం సంచలనంగా మారింది. ఈ కేసులో అనేక చిక్కుముడులు ఉన్నాయి. వాటన్నింటికి సమాధానాలు రాబట్టడం కోసం పోలీసులు నిందితుడిని కస్టడీకి ఇవ్వాల్సిందిగా కోరుతున్నారు. అలానే బాలిక హత్య జరిగిన రోజు నిందితుడు కుందేలుకు అనారోగ్యంగా ఉందని హడావుడి చేశాడని.. దాని గురించి కూడా పూర్తి వివరాలు తెలియాల్సి ఉందంటున్నారు పోలీసులు. ఆ వివరాలు..