హైదరాబాద్ బాలాపూర్లో సెలైన్ నీటిలో పెయిన్ కిల్లర్ మాత్రలు కలిపి మత్తు పదార్థం తయారు చేస్తున్న యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. బాలాపూర్కు చెందిన సయీద్ సాహిల్కు ప్రిస్క్రిప్షన్ లేకుండా మాత్రలు విక్రయించిన మెడికల్ షాప్ యజమాని ప్రవీణ్ అనే వ్యక్తిని సైతం అరెస్ట్ చేశారు. సాహిల్ ఈ మత్తు పదార్థాన్ని ఇతరులకు విక్రయించగా.. వారిలో ఒక బాలుడు మృతి చెందాడు. మరో ఇద్దరు చికిత్స పొందుతున్నారు.