బాసర ఆలయం అభివృద్ధి కోసం భారీగా నిధులు.. రూ.190 కోట్లతో

11 months ago 19
నిర్మల్ జిల్లా బాసరలోని సరస్వతి అమ్మవారి ఆలయం అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది. ఈ మొత్తంతో బాసరను టెంపుల్ టూరిజం హబ్‌గా అభివృద్ధి చేస్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. ఇందుకుగాను తెలంగాణ సర్కార్ రూ.190 కోట్లతో మాస్టర్ ప్లాన్ అమలు చేయబోతుందని ఆయన చెప్పుకొచ్చారు. బాసరలో రూ.5.75 కోట్లతో 30 పడకల ఆసుపత్రి భవనానికి మంత్రి జూపల్లి శంకుస్థాపన చేశారు. అలానే త్వరలోనే రానున్న గోదావరి పుష్కరాల ఏర్పాట్లను పకడ్బందీగా నిర్వహించాలని అధికారులకు సూచించారు.
Read Entire Article