తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. బాసరలో నెల రోజుల్లో రెండోసారి వరద పోటెత్తడంతో దసరా వేడుకలకు వచ్చిన భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే.. అల్పపీడనం తీరం దాటడంతో నేడు వర్షాల నుంచి ఉపశమనం లభిస్తుందని వాతావరణ శాఖ ప్రకటించింది. మూసీ నది వరద ఉద్ధృతి కూడా కాస్త తగ్గింది.