రేపటి (మే 07) నుంచి సమ్మెకు దిగాల్సిన ఆర్టీసీ ఉద్యోగులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వంతో జరిపిన చర్చలు సఫలం కావడంతో సమ్మె విరమిస్తున్నట్టు ఆర్టీసీ జేఏసీ ఈ నిర్ణయం తీసుకుంది. మంత్రి పొన్నం ప్రభాకర్ చొరవతో చర్చలు సఫలం అయ్యాయి. మరోవైపు.. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కమిటీని నియమించడంతో సమ్మె విరమణకు దారితీసింది.