బిగ్‌షాక్.. తెలంగాణ మంత్రుల వాట్సాప్ మీడియా గ్రూప్స్ హ్యాక్..

3 months ago 9
తెలంగాణలో సైబర్ నేరగాళ్లు మరోసారి రెచ్చిపోయారు. ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో) గ్రూపుతో పాటు పలువురు రాష్ట్ర మంత్రుల వాట్సాప్ మీడియా గ్రూపులను లక్ష్యంగా చేసుకున్నారు. ఎస్‌బీఐ బ్యాంక్ ఆధార్ అప్‌డేషన్ పేరుతో ఫేక్ ఏపీకే ఫైల్స్‌ను షేర్ చేసి.. తొలుత జర్నలిస్టుల ఫోన్లను హ్యాక్ చేశారు. వారి ఫోన్ల ద్వారానే కీలక గ్రూపుల్లోకి చొరబడ్డారు. ఈ ఘటన రాష్ట్ర పరిపాలనలో కలకలం రేపింది. సైబర్ పోలీసులు వెంటనే అప్రమత్తమై.. ఏపీకే ఫైల్స్, అనుమానాస్పద లింకులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఓపెన్ చేయవద్దని హెచ్చరిస్తున్నారు.
Read Entire Article