హైదరాబాద్లో ఒక విషాదకర సంఘటన చోటుచేసుకుంది. రాజేంద్రనగర్ పరిధిలో చికెన్ బిర్యానీ తిన్న భార్య మృతి చెందగా, భర్త తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఫుడ్ పాయిజన్ కారణంగా రాజేశ్వరి అనే మహిళ మరణించగా, ఆమె భర్త రమేష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.