హైదరాబాద్ శివారులోని ఒక ఫేమస్ రెస్టారెంట్లో గుజ్జా కృష్ణారెడ్డి అనే కస్టమర్కు చేదు అనుభవం ఎదురైంది. ఆర్డర్ చేసి సగం తిన్న బిర్యానీలో చచ్చిన బల్లి కనిపించడంతో అతడు షాక్కు గురయ్యాడు. ఏదేంటని ప్రశ్నించగా.. రెస్టారెంట్ యజమాని నిర్లక్ష్యంగా సమాధానమిచ్చాడు. దీంతో ఆగ్రహించిన కృష్ణారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు కావడంతో యజమాని పరారయ్యాడు.