తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల జాతర కొనసాగుతోంది. మొన్నటివరకు పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల హడావుడి నడవగా.. ఇప్పుడు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల ఎన్నికలకు సమయం ఆసన్నమైంది. మార్చి 20న ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనుండగా.. రాజకీయా పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థులను ప్రకటించగా.. సంఖ్యా బలం ప్రకారం బీఆర్ఎస్కు ఒక స్థానం దక్కగా.. తమ అభ్యర్థిని ప్రకటించింది గులాబీ పార్టీ.