MP Etela Rajender KCR Remark: బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్, మాజీ సీఎం కేసీఆర్ను 'మా బాస్' అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మల్కాజిగిరిలో అభివృద్ధి పనుల శంకుస్థాపన అనంతరం జరిగిన సభలో ఈటల మాట్లాడుతూ, ప్రజలే తనకు అండగా ఉన్నారని, తనతో ఉంటే లాభమే తప్ప నష్టం లేదని అన్నారు. ఈ క్రమంలో కేసీఆర్ను 'మా బాస్' అనడంతో సభలో ఒక్కసారిగా జై కేసీఆర్ నినాదాలు మిన్నంటాయి. ఈటెల్ వ్యాఖ్యలు రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారాయి.