తెలంగాణలో ఇంజనీరింగ్ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలో కొత్త నిబంధనలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య ప్రతినిధులు ప్రభుత్వంతో జరిపిన చర్చల్లో, ఫీజుల భారాన్ని తగ్గించడానికి కొన్ని పరిమితులు విధించాలని సూచించారు. ప్రస్తుతం.. కొన్ని బ్రాంచ్లలో 500కు పైగా సీట్లు ఉండగా.. కన్వీనర్ కోటాలో చేరే 85 శాతం మందికి రీయింబర్స్మెంట్ ఇస్తున్నారు. దీనికి బదులుగా.. ప్రతి బ్రాంచీలో కేవలం రెండు సెక్షన్ల (120 సీట్లు) వారికి మాత్రమే ఈ ప్రయోజనం కల్పించాలని సూచించారు. దీనిపై పరిశీలన కోసం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఒక కమిటీని నియమిస్తామని తెలిపారు.