ఇటీవల కాలంలో కల్వకుంట్ల కవిత ఎపిసోడ్ తెలంగాణ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా ఆమె మాజీ మంత్రి హరీశ్ రావుపై చేసిన సంచలన ఆరోపణల నేపథ్యంలో ఆమెను బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. దీంతో కవిత మరుసటి రోజు పార్టీ సభ్యత్వానికి , ఎమ్మెల్సీకి రాజీనామా చేశారు. తాజాగా ఆమె కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.