గత ఏడాది బుడమేరు వరద బీభత్సం సృష్టించడంతో, కూటమి ప్రభుత్వం నష్ట నివారణ చర్యలకు ఉపక్రమించింది. దీనిలో భాగంగా బుడమేరు పరిధిలోని 380 ఆక్రమణలను గుర్తించింది. త్వరలోనే వాటిని తొలగించేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అలానే వరద నీటిని మళ్లించేందుకు కొత్త కాలువ తవ్వకం, ఇప్పటికే ఉన్న కాలువల వెడల్పు, రక్షణ గోడల నిర్మాణం వంటి పనులు చేపట్టనున్నారు. వీటి కోసం ఏపీ ప్రభుత్వం రూ. 33 కోట్లు మంజూరు చేసింది. త్వరలోనే ఇవి ప్రారంభం అవుతాయి అంటున్నారు.