Vijayawada Bangalore Economic Corridor: ఆంధ్రప్రదేశ్లో రూ.1.40 లక్షల కోట్ల జాతీయ రహదారుల ప్రాజెక్టులను 2029 నాటికి పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. బెంగళూరు-అమరావతి కనెక్టివిటీని పెంచే కోడూరు-ముప్పవరం ఎకనమిక్ కారిడార్ను 2027 నాటికి పూర్తి చేయాలని, కీలక పోర్టులను జాతీయ రహదారులతో అనుసంధానం చేయాలని సూచించారు. రహదారుల నిర్మాణంలో నూతన సాంకేతికతలను ఉపయోగించాలని, గుంతలు లేకుండా చూడాలని ఆదేశించారు. చంద్రబాబు రాష్ట్రంలో జాతీయ రహదారలుపై సమీక్ష చేశారు.