విజయవాడ ఇంద్రకీలాద్రి ఆలయంలో హుండీ లెక్కించారు. ఆగస్ట్ నెలకు సంబంధించిన కానుకలకు సంబంధించిన లెక్కింపులు పూర్తి చేసినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. ఆగస్ట్ నెలలో బెజవాడ కనకదుర్గమ్మకు కళ్లు చెదిరేలా ఆదాయం వచ్చినట్లు పేర్కొన్నారు. డబ్బు, బంగారం, వెండి సహా ఇతర దేశాల కరెన్సీ కూడా లభ్యమైనట్లు ఆలయ అధికారులు తెలిపారు.