విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మకు తెలంగాణలోని సిరిసిల్ల జిల్లాకు చెందిన భక్తుడు నల్ల విజయ్ కుమార్ అరుదైన కానుకగా అగ్గిపెట్టెలో పట్టే చీరను సమర్పించారు. ఈ చీర 5.5 మీటర్ల పొడవు, 40 ఇంచుల వెడల్పు, 100 గ్రాముల బరువుతో రూపొందించబడింది. బుధవారం ఉదయం కుటుంబసభ్యులతో కలిసి ఆలయానికి చేరుకున్న విజయ్ కుమార్, ఆలయ అధికారుల సమక్షంలో ఈ చీరను అమ్మవారికి అందజేశారు.