బెట్టింగ్ యాప్లపై యుద్ధం చేస్తున్న యూట్యూబర్ అన్వేష్.. ఈ యాప్లను సోషల్ మీడియాలో బాగా ప్రచారం చేస్తున్న సెలబ్రిటీల చిట్టాను బయట పెట్టడం ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారింది. ఒకవైపు.. ఇలాంటి సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లపై యుద్ధం చేస్తూనే.. మరోవైపు.. బెట్టింగ్కు దూరంగా ఉండాలని యువతకు అవగాహన కల్పిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఒక వార్త నెట్టింట వైరల్ అవుతోంది. బెట్టింగ్లు పెట్టి డబ్బులు కోల్పోయిన బాధితులకు అన్వేష్ రూ.60 లక్షలు ఇస్తానని చెప్పినట్లు పోస్ట్లు చక్కర్లు కొడుతున్నాయి.