బేగంపేట ఎయిర్పోర్టు సమీపంలో వరద ముంపు, రోడ్లపై ట్రాఫిక్ రద్దీ నివారణకు జీహెచ్ఎంసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఎయిర్పోర్టులో కృత్రిమ చెరువును నిర్మించాలని డిసైడ్ అయింది. కార్వో ప్రాంగణంలో 40 లక్షల లీటర్ల సరస్సు, పక్కనే మరో 20 లక్షల లీటర్ల కుంట తవ్వనున్నారు. ఎయిర్పోర్టు నుంచి వచ్చే వరద నురు బేగంపేట పైవంతెన కిందకు చేరకుండా చర్యలు తీసుకుంటున్నారు.