బోనాల పండుగ సమీపిస్తున్న వేళ వివాదాస్పద వ్యాఖ్యలతో ఎమ్మెల్యే రాజా సింగ్ మరోసారి వార్తల్లో నిలిచారు. మద్యం సేవించి ఆలయానికి వచ్చే వారిని అనుమతించవద్దని ఆలయ కమిటీ సభ్యులకు సూచించారు. ప్రతి గుడి వద్ద 'మద్యం సేవించి ఆలయంలోకి రావొద్దు' అని బ్యానర్ ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. నేటి యువతకు బోనాల పండుగ యొక్క పవిత్రతను తెలియజేయాల్సిన అవసరం ఉందని రాజా సింగ్ అన్నారు.