TTD AEO Warns Fake News: వేసవి సెలవుల రద్దీతో తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులకు టీటీడీ సిబ్బంది అన్నప్రసాదాలు, తాగునీరు అందిస్తూ సౌకర్యాలు కల్పిస్తున్నారు. అయితే, కొందరు భక్తులు టీటీడీ సేవలను విమర్శిస్తూ అసత్య ఆరోపణలు చేస్తున్నారని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అదనపు కార్యనిర్వహణాధికారి వెంకయ్య చౌదరి హెచ్చరించారు. రద్దీని దృష్టిలో ఉంచుకుని వీఐపీ బ్రేక్ దర్శనాలను తగ్గించి సాధారణ భక్తులకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఆయన తెలిపారు.