ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భక్తులకు తీపికబురు వినిపించారు. శ్రీరామనవమికి రెండు రోజుల ముందే రామతీర్థంలో గిరి ప్రదక్షిణ మార్గం అందుబాటులోకి తెచ్చారు. మహా శివరాత్రికి శ్రీకాళహస్తి గిరి ప్రదక్షిణ మార్గం ప్రారంభించిన పవన్ కళ్యాణ్.. తాజాగా రామతీర్థం గిరి ప్రదక్షిణ మార్గం ప్రారంభించారు. కోటప్పకొండలోనూ గిరి ప్రదక్షిణ మార్గానికి రోడ్డు మంజూరు చేసినట్లు పవన్ కళ్యాణ్ వెల్లడించారు. కూటమి ప్రభుత్వం ఆలయాల పరిరక్షణకు కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.