వరంగల్ భద్రకాళి ఆలయాన్ని అద్భుతంగా అభివృద్ధి చేస్తున్నారు. తమిళనాడులోని మదరై మీనాక్షి అమ్మవారి దేవాలయం నమూనాలో అభివృద్ధి చేయడానికి రూ.54 కోట్లు కేటాయించారు. ఆలయం చుట్టూ మాడవీధులు, నాలుగువైపులా రాజగోపురాలు నిర్మించాలని నిర్ణయించారు. ఆలయ చరిత్ర తెలిసేలా నిర్మాణాలు ఉండాలని ప్రభుత్వం భావిస్తోంది.