భద్రాచలం ఆలయంతో పాటు పట్టణాన్ని అద్భుతంగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ ప్రభుత్వం రూ.586 కోట్లతో అభివృద్ధి ప్రణాళికను సిద్ధం చేసింది. ఇందులో మొదటి దశ పనుల కోసం రూ.351 కోట్లను కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటనలకు పరిమితం కాగా.. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం నిధుల మంజూరుతో పాటు స్పష్టమైన గడువును నిర్ణయించింది. ఈ ఏడాదే పనులు ప్రారంభం కానుండగా.. గోదావరి ఘాట్లు, ఆలయ ప్రాకారాల విస్తరణ, భక్తుల సౌకర్యాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు.