భద్రాచలంలో యజమాని, సంగారెడ్డిలోని ఇంట్లోకి దొంగలు.. టెక్నాలజీ సాయంతో భలే పట్టించేశాడుగా..!

7 months ago 16
సంగారెడ్డి జిల్లాలో ఓ ఇంట్లో దొంగతనానికి వచ్చిన దొంగలు అడ్డంగా దొరికిపోయారు. ఓ కుటుంబం భద్రాచలం వెళ్లిన సమయంలో దొంగలు ఇంట్లోకి చొరబడ్డారు. అయితే, సీసీటీవీ ఫుటేజీని చెక్ చేసిన ఆ ఇంటి యజమాని.. అప్రమత్తమై ఇరుగుపొరుగు వారికి సమాచారం అందించాడు. అనంతరం పోలీసులకు విషయం చెప్పాడు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు.. స్థానికుల సహాయంతో దొంగలను పట్టుకున్నారు. కాగా, అదుపులోకి తీసుకునే సమయంలో దొంగలు చేతులు కోసుకుని వింతగా ప్రవర్తించారు.
Read Entire Article