సంగారెడ్డి జిల్లాలో ఓ ఇంట్లో దొంగతనానికి వచ్చిన దొంగలు అడ్డంగా దొరికిపోయారు. ఓ కుటుంబం భద్రాచలం వెళ్లిన సమయంలో దొంగలు ఇంట్లోకి చొరబడ్డారు. అయితే, సీసీటీవీ ఫుటేజీని చెక్ చేసిన ఆ ఇంటి యజమాని.. అప్రమత్తమై ఇరుగుపొరుగు వారికి సమాచారం అందించాడు. అనంతరం పోలీసులకు విషయం చెప్పాడు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు.. స్థానికుల సహాయంతో దొంగలను పట్టుకున్నారు. కాగా, అదుపులోకి తీసుకునే సమయంలో దొంగలు చేతులు కోసుకుని వింతగా ప్రవర్తించారు.