భద్రాద్రి రాముల వారి భక్తులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఆలయ అభివృద్ధి కోసం రాష్ట్ర సర్కార్ భారీ ఎత్తున నిధులు కేటాయించేందుకు రెడీ అవుతోంది. రాములవారి ఆలయం కోసం రూ.350 కోట్లతో మాస్టర్ ప్లాన్ రెడీ చేస్తోంది. త్వరలోనే ఈ పనులు ప్రారంభిస్తామని అధికారులు తెలిపారు. నాలుగు దశల్లో ఆలయ అభివృద్ధి పనులు జరుపుతామని అధికారులు వెల్లడించారు. ప్రభుత్వ నుంచి అనుమతి రావడమే తరువాయి.. మాస్టర్ ప్లాన్ను అమలు చేస్తామంటున్నారు. ఆ వివరాలు..