భద్రాచలం తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ పుణ్యక్షేత్రం. సీతారాములు కొలువైన ఉన్న భద్రాద్రి.. రాష్ట్ర విభజన నాటి నుంచి అభివృద్ధికి దూరమైంది. భౌగోళిక కారణాలతోపాటు రాజకీయ కారణాలు కూడా తోడుకావడంతో రాముడు ఎవరికి పట్టనివాడయ్యాడు. కేసీఆర్ హయాంలో భద్రాచలం పురోగతి ఆగిపోయింది. అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. మంత్రి తుమ్మల చొరవతో సీఎం రేవంత్ రెడ్డి భద్రాచలంపై శ్రద్ధ పెడుతున్నారు. ఆలయాభివృద్దితోపాటు ఇతర కీలక సమస్యలను పరిష్కరించే దిశగా ముందడుగు వేస్తున్నారు.